60 ఏళ్లు దాటినా వ్యక్తుల పై కోవిడ్ యొక్క మొదటి మరియు రెండవ దశలు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దేశంలో సంభవించిన 2.5 లక్షల కోవిడ్ మరణాలలో, ఎక్కువ మంది ఈ వయస్సు గలవారు. ఇది చాలా పెద్ద ప్రమాదం అని మేము అనుకున్నప్పుడు, 110 సంవత్సరాల కలిగిన వ్యక్తి వైరస్ నుండి కోలుకున్నాడు. ఇది హైదరాబాద్లో జరిగింది.

రామానంద తీర్థులుగా పేరు కలిగిన ఆయన రిటైర్డ్ ప్రభుత్వ అధికారి, ఆయన రెండు దశాబ్దాలు పాటు హిమాలయాలకు వెళ్లాడు. వ్యాధి బారిన పడటానికి ముందు, ఆయన కీసరలోని ఆశ్రమంలో ఉన్నాడు మరియు గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఆహారం మరియు అవసరాలను చూసుకునేవాడు.

ఏప్రిల్ 24 న రామానంద కు వైరస్ సోకింది మరియు అదే డాక్టర్ అతన్ని గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. మరొక రోజు, ఆ వ్యక్తికి టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చింది. అతని ఆక్సిజన్ లెవెల్స్ 92-97 మధ్య నమోదు చేయబడ్డాయి.

ఇంత వరకు ప్రపంచం లోనే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులలో రామానంద గారే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తి. కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ ఆయన మరి కొన్ని రోజులు హాస్పిటల్ లో చికత్స తీసుకోవాల్సి ఉంది.

x