కరోనావైరస్ సమాజాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ, కొంతమంది నిబంధనలను ఉల్లంఘించడం మరియు సాధారణ సామాజిక జీవితాన్ని కొనసాగించడం తరచుగా దేశవ్యాప్తంగా చూస్తున్నాము. కరోనా సోకిన శవాన్ని ప్రోటోకాల్ పాటించకుండా దహనం చేసిన తరువాత రాజస్థాన్ యొక్క సికార్ జిల్లాలో ఇరవై ఒక్క మంది మరణించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 21 న ఖేర్వా గ్రామానికి ఒక కోవిడ్ రోగి మృతదేహాన్ని తీసుకువచ్చారు మరియు అంత్యక్రియలకు 150 మందికి పైగా హాజరయ్యారు. సామాజిక దూరం మరియు ఇతర ప్రోటోకాల్ను పాటించకుండా ఆ మృత దేహాన్ని దహనం చేశారు. అలాగే, మృతదేహాన్ని అనేక మంది స్థానికులు తాకినట్లు సమాచారం. అయితే, కోవిడ్ కారణంగా 21 మరణాలు సంభవించాయని అధికారులు ఖండించారు.
21 మరణాలలో 3-4 మరణాలు కరోనా కారణంగా మాత్రమే సంభవించాయి. మరణాలలో ఎక్కువ భాగం వృద్దాప్యం వల్ల సంభవించాయి. COVID-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవునా కాదా అని తనిఖీ చేయడానికి మేము ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క బంధువులు, సన్నిహితుల అయినటువంటి 147 మంది నుండి COVID-19 పరీక్షకు నమూనాలు సేకరించాము. ”అని లక్ష్మన్ఘర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ కులరాజ్ మీనా ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
ఆ గ్రామంలో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించబడింది మరియు ఆ ప్రదేశంలో నివసించే ప్రజలకు పరిస్థితి యొక్క తీవ్రతను వివరించారు. అవగాహన తెచ్చిన తరువాత, స్థానికులు అర్థం చేసుకున్నారు మరియు సహకరించారని అధికారులు తెలిపారు.
ఖీర్వా గ్రామం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా యొక్క నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అతను ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు, కాని తరువాత దానిని తొలగించాడు. “తీవ్ర దుఃఖంతో, 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు చాలామందికి కరోనా సోకినట్లు భావిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.