సామాన్యుడిపై అధిక భారాన్ని మోపుతూ GST రూపంలో పేదవాడి దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నందుకు గాను 26న భారత్ బంద్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. GST కి వ్యతిరేఖంగా అఖిల భారత వర్తక సామాఖ్య ఫిబ్రవరి 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అదే రోజు చక్క జామ్ రహదారుల నిర్బంధనం నిర్వహిస్తామని అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం సంఘీభావం ప్రకటించింది.

GST తో వర్తకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని CAIT పేర్కొంది. GSTలోటుపాటులపై ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా GST కౌన్సిల్స్ స్పందించలేదని, వర్తక సంఘాల నేతలు ఆరోపించారు. GST లోపాలను సవరించాలని కాన్ఫెడరేషన్ అఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) డిమాండ్ చేస్తుంది.

క్వాడ్ పరిధిలోకి వచ్చే దేశానికీ చెందిన 8 కోట్లకు పైగా వ్యాపారవేత్తలు ఈ బంద్ కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో అఖిల భారత రవాణా సంఘం ఈ బంద్ కు మద్దతు తెలిపింది. GST ని సరళతరం చేసేందుకు GST కౌన్సిల్ ఆసక్తి కనబరచడం లేదని, కేవలం ఆదాయం పెంచుకునేందుకే మొగ్గు చూపుతుందని వర్తక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఇందుకు నిరసనగా GST కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 26 తేదీన భారత్ బంద్ కి పిలుపునిచ్చింది. పెంచిన ధరలపై GST తగ్గించేందుకు నిరసన తెలపాలని వారటక సంఘాలు నిర్ణయించాయి. ప్రతి భారతీయుడికి, సామాన్యుడికి మధ్య తరగతి వాడికి అందుబాటులో ఉంచాలని డిమాండు చేస్తున్నారు.

GST రూపంలో అధికంగా డబ్బులు వసూలు చేయడం మానుకోవాలని ఈ భారత్ బంద్ ను నిర్వహించనున్నారు.

x