గత 24 గంటల్లో రాష్ట్రంలో 14,669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. అంటే కాదు 71 మంది కరోనా వల్ల చనిపోయారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్మాట్లాడుతూ ఒకట్రెండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని ఆయన చెప్పారు. కరోనా చికిత్సకోసం 422 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చామని, ఆయన 2570 ఐసీయూ బెడ్లు మరియు 7744 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. బెడ్స్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ఆయన ప్రకటించారు.