దేశంలో కరోనా కేసులు అంతకంతకూ విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మన దేశంలో 3 లక్షల 86 వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల రోజురోజుకి మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు రోజుకి సుమారు మూడు వేలా కు పైగా ప్రజలు కరోనా వల్ల చనిపోతున్నారు. గడచిన 24 గంటల్లో 3 వేల 498 మంది కారొనతో పోరాడి చనిపోయారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానం లో కొనసాగుతోంది. ఢిల్లీ, పంజాబ్ లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.