పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు మెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయింది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ జరిపిన సీన్స్ లో కొన్నిటిని రీ షూట్ చేయనున్నారని ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ ‘ప్రసాద్ మూరెళ్ల’ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే ప్రసాద్ ఈ సినిమా నుంచి బయటికి వెళ్లరని టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తెలుగులో భరత్ అనే నేను చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రవి కె.చంద్రన్ ను తీసుకున్నారు. అయితే, ప్రసాద్ మూరెళ్ల ఆధ్వర్యంలో చిత్రీకరించిన సన్నివేశాలను రీ షూట్ చేయాలని చూస్తున్నారు. ఇదే గనుక నిజమైతే ఏకె రీమిక్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు.
కానీ, ఇప్పుడు రీషూట్ చేస్తే దాని ప్రభావం హరిహర వీరమల్లు చిత్రంపై కూడా పడుతుంది. ఇకపోతే ఏకె రీమిక్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి, హరిహర వీరమల్లు చిత్రాన్ని సమ్మర్ కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ ను బట్టి PSPK28 వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని హరీష్ శంకర్ చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ షూటింగ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి.